January 1, 2020

తెలియని రాగం పలికింది



తెలియని రాగం పలికింది
మమతల కోవెల (1989)
చక్రవర్తి
సినారె 
బాలు, సుశీల

పల్లవి: 

తెలియని రాగం పలికింది
తీయని భావనలో
తెలియని రాగం పలికింది 
తీయని భావనలో
మనసే జ్యొతిగా వెలిగింది 
మమతల కోవెలలో
ఈ మమతల కోవెలలో
తెలియని రాగం పలికింది 
తీయని భావనలో
చరణం 1:

ఆకాశ దీపానివై 
నా కోసమే రమ్మని
నా గుండె గుడిగంటలో 
నాధానివే నీవని
గోరంత పసుపెట్టి ఊరంత కబురెట్టే 
శ్రీవారే రావాలని
కుంకుమతో కుశలమని 
పారాణే... పదిలమని
దీవించు దేవుల్లే 
మా ఇంటివారని

చరణం 2:

ఏ జన్మకే గమ్యమో 
తెలిసేది కాలానికే
ఏ పువ్వు ఏ పూజకో 
తెలిసేది దైవానికే
ఏ జన్మకేమైన ఈ జన్మలో నీకు 
ఖైదీనే అయ్యానుగా
బ్రతుకైనా వెతలైనా 
జతగానే పంచుకునే 
శ్రీవారే కావాలి ఏ జన్మకైనా