October 28, 2021

తెలుసులే తెలుసులే

తెలుసులే తెలుసులే 


చిత్రం: జేగంటలు (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

తెలుసులే తెలుసులే  
నీకు తెలుసోలేదో గానీ నాకు తెలుసులే 
ఎవరేమన్నా ఏమనుకున్నా 
ప్రేమే గెలవక తప్పదని 
తెలుసులే

తెలుసులే తెలుసులే  
నీకు తెలుసోలేదో గానీ నాకు తెలుసులే 
కౌగిట కలిసిన ప్రేమలకు 
చీకటి తొలగక తప్పదనీ 
తెలుసులే
తెలుసులే తెలుసులే

October 15, 2021

​మాతృభాష


ఇప్పుడు ప్రజలంతా పుస్తకాలను వాడుకభాషలో చదువుతున్నా, విద్యార్థులు మాట్లాడే భాషలోనే పరీక్షలు వ్రాస్తున్నా...అదంతా "వాడుక భాషోద్యమ పితామహుడు"గా ప్రసిద్ధికెక్కిన గిడుగు వేంకట రామ్మూర్తి పంతులు గారి (ఆగష్టు 29, 1863 - జనవరి 22, 1940) చలవే. గ్రాంథికభాషలో ఉన్నతెలుగు వచనాన్ని వాడుకభాషలోకి తీసుకువచ్చి, నిత్య వ్యవహారిక భాషలో ఉన్న సౌందర్యాన్నీ, సుళువునూ తెలియజెప్పిన మహనీయుడు గిడుగు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషాశాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త,హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథ రచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెనుగు చిచ్చర పిడుగు...గిడుగు. ఆయన  గారి ఉద్యమం వల్లనే... ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు, వ్యావహారికభాషలో సాగి, ఎక్కువ మందిని ఆకర్షించి మరింతగా అందుబాటులోకి వచ్చింది. అప్పటిదాకా పుస్తకాల్లో ఉన్న ఎక్కువమందికి అర్థం కాని భాష వ్యర్ధమనీ, కనీసం పిల్లలు చదివే పాఠ్యపుస్తకాలయినా వాడుకభాషలో ఉండాలని రామ్మూర్తిగారు ఉద్యమించారు. ఆయన మరణించేవరకూ వాడుకభాష అమలు కోసమే పోరాడారు. తెలుగు వ్యావహారిక భాషాభ్యున్నతికి గిడుగు రామ్మూర్తి పంతులు గారి సేవలను గుర్తిస్తూ ఆయన జయంతిని పురస్కరించుకుని 'తెలుగుభాషా దినోత్సవము'గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పరిగణిస్తుంది.