Showing posts with label రామకృష్ణ. Show all posts
Showing posts with label రామకృష్ణ. Show all posts

పువ్వుల కన్నా పున్నమి వెన్నెల

కరుణామయుడు (1978)
రచన: విజయరత్నం
సంగీతం: బి. గోపాలం
గాయకుడు: వి. రామకృష్ణ

పువ్వుల కన్నా 
పున్నమి వెన్నెల కన్నా
మిన్నయైనది పసిడికుసుమం 
ఎవరు?  ఎవరు? 
ఎవరీ సలలితగాత్రి
ఎవరో! ఎవరో! 
ఇంకెవరో కాదు 
పరమ పావని మరియా
ఈ కన్య మరియా...

ఎందుకో నీవు నాతో


ఎందుకో నీవు నాతో
చిత్రం: కృష్ణవేణి (1974)
సంగీతం: విజయ భాస్కర్
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: రామకృష్ణ, సుశీల

పల్లవి:

ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి...
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి...

ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి..
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి...

కరుణామయా… దేవా

కరుణామయా… దేవా

చిత్రం : భక్త తుకారాం (1973)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : రామకృష్ణ

రంగా…..రంగా
కరుణామయా… దేవా
చేరనీయవా రావా
పండరీక పాండురంగ విఠలా
రావా దేవా కరుణామయా దేవా…

పాండురంగ నామం..


పాండురంగ నామం..
చిత్రం : భక్తతుకారాం (1973)
సంగీతం : ఆదినారాయణ రావు
సాహిత్యం : వేటూరి
గానం : రామకృష్ణ

పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..అదే మోక్షతీరం
వేదసారం..మధురం..మధురం

పిలుపు వినగలేవా


పిలుపు వినగాలేవా
భక్త తుకారాం (1973)
దాశరథి
రామకృష్ణ
ఆదినారాయణరావు

రంగా…..పాండు రంగా
పిలుపు వినగ లేవా
నీ గుడికి తిరిగి రావా
దేవాది దేవా నా పిలుపు వినగలేవా
నీ రూపం కానరాని వేళా నీ భక్తులకు ఈ లోకమేలా
నీ ధ్యానమేరా నీ గానమేరా ఆనాడు ఈనాడు మా జీవితం

ఎవరికి ఎవరు చివరికి ఎవరు?

ఎవరికి ఎవరు
దేవదాసు మళ్ళీ పుట్టాడు (1978)
ఎస్.రాజేశ్వరరావు
సినారె
రామకృష్ణ, శ్రీమతి రమణ

ఎవరికి ఎవరు చివరికి ఎవరు?
ముగియని ఈ యాత్రలోనా
ముగిసే ఈ జన్మలోనా?

చరణం 1:

పూలను పెంచే తోటమాలీ
నీవే తోటకు నిప్పులు పెడితే
వెన్నెల కురిసే పున్నమి జాబిలీ
చీకటితో నీవు చేయి కలిపితే
వెన్నెల లేదు-వేకువ లేదు
వెన్నెల లేదు-వేకువ లేదు
ఉదయం లేదు-హృదయం లేదు
బ్రతుకే చేదు

చరణం 2:

దేవుడు వెలసిన కోవెల తానే
వల్లకాడుగా మారిపోతే
గుండెలమాటున నిండుగ వెలిగే
ప్రణయదీపమే ఆరిపోతే
దేవుడు లేడు - జీవుడు లేడు
దేవుడు లేడు - జీవుడు లేడు
వేడుకలేదు-వేదన లేదు
వలపే చేదు

నీవే.. నీవే.. ఓ ప్రియా

"వాదా కర్లే సాజనా" అన్న హిందీ పాటని తెలుగులో తర్జుమాచేసి ఆరుద్రగారు వలికించిన ప్రేమరసం...

నీవే.. నీవే.. ఓ ప్రియా
చిత్రం :  మనుషులు చేసిన దొంగలు (1977)
సంగీతం :  సత్యం
గీతరచయిత  :  ఆరుద్ర
నేపధ్య గానం :  రామకృష్ణ, సుశీల

పల్లవి :

నీవే.. నీవే.. ఓ ప్రియా
నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా
నేనేలే ప్రియా... నీవేలే సుమా...  నేనేలే ప్రియా...

చరణం 1 :

అలలై ఊగే ఈ పూలలో... కలలై మూగే ఈ వేళలో
నను పిలిచే కోరిక నీవే...  నను పిలిచే కోరిక నీవే

పగలు  రేయి నా ధ్యానమై... ఏనాడైనా నాదానవై
నను తలచే రాధిక నీవే... నను తలచే రాధిక నీవే
ఆ.. ఆ... ఆ...ఆ...

నీవే.. నీవే.. ఓ ప్రియా
నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా
నేనేలే ప్రియా... నీవేలే సుమా...  నేనేలే ప్రియా...

చరణం 2 :

పావన జీవన తీరాలలో...ఊహల కోయిల రాగలలో
నను కొలిచే దేవివి నీవే... నను కొలిచే దేవివి నీవే

అనురానికి వేదానివై... నా హృదయానికి నాదానివై
నను వలచే దైవము నీవే... నను వలచే దైవము నీవే
ఆ... ఆ.. ఆ ... ఆ...

నీవే.. నీవే.. ఓ ప్రియా
నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా
నేనేలే ప్రియా... నీవేలే సుమా...  నేనేలే ప్రియా...

మానవా...! ఏమున్నది



మానవా...! ఏమున్నది
చక్రధారి (1977)
రామకృష్ణ
జీ.కే.వెంకటేష్

పరమహంసను గాను పండితుడను గాను
హరి కీర్తనము తప్ప వేరేది ఎఱుగను
వేరేది ఎఱుగను
మానవా ఏమున్నది ఈ దేహం
ఇది రక్తమాంసముల అస్థిపంజరం
దీనిపై ఏలరా ఈ వ్యామోహం?
మానవా ఏమున్నది ఈ దేహం
మానవా... ఏమున్నది ఈ దేహం

నవమాసాలు కడుపునా చెరబడీ
నవరంధ్రాలతో భువిపై దిగబడి
నవనవలాడీ
జవజవలాడి
నశించే బొమ్మరా
ఈ నరజన్మ
మానవా ఏమున్నది ఈ దేహం
మానవా... ఏమున్నది ఈ దేహం

ఊపిరాడేవరకే నేనూ నాదను మమకారాలు
ఆపై వల్లకాటిలో ఉండవు ఏ తేడాలు
మట్టి మట్టిలో గాలి గాలిలో
మాయమౌ బొమ్మరా
ఈ నరజన్మ
మానవా ఏమున్నది ఈ దేహం
మానవా... ఏమున్నది ఈ దేహం

వచ్చేటప్పుడు నీతో తెచ్చేదేది లేదు
పోయేటప్పుడు తీసుకుపోయేదేదీ లేదు
ఈ రాకపోకలా చీకటిదారిలో
దివ్వెరా విఠలుని దివ్యనామం
మానవా ఏమున్నది ఈ దేహం
ఇది రక్తమాంసముల అస్థిపంజరం
దీనిపై ఏలరా ఈ వ్యామోహం?
మానవా ఏమున్నది ఈ దేహం
మానవా... ఏమున్నది ఈ దేహం

నువ్వెవరయ్యా... నేనెవరయ్యా



నువ్వెవరయ్యా... నేనెవరయ్యా
చక్రధారి (1977)
సంగీతం: జీ.కే.వెంకటేష్
రచన: ఆచార్య ఆత్రేయ
గానం: రామకృష్ణ

పల్లవి::

విఠలా.... పాండురంగ విఠలా
నువ్వెవరయ్యా.... నేనెవరయ్యా
నువ్వెవరయ్యా.... నేనెవరయ్యా
నువ్వూ నేనూ ఒకటేనయ్య
విఠలా....
నువ్వేనేనని నేనేనువ్వని
నమ్మినవాడిని నేనయ్యా
నువ్వెవరయ్యా... నేనెవరయ్యా
నువ్వూ నేనూ ఒకటేనయ్య

చరణం::1

జీవనమునకై మట్టికుండలను
చేసి అమ్ముకుంటూ కుమ్మరి నేను
జీవనమునకై మట్టికుండలను
చేసి అమ్ముకుంటూ కుమ్మరి నేను
జీవం పోసిన బొమ్మలు చేసే
జీవం పోసిన బొమ్మలు చేసే
బ్రహ్మను చేసిన కుమ్మరి నీవు
బ్రహ్మను చేసిన కుమ్మరి నీవూ
విఠలా.... పాండురంగ విఠలా
జయజయ విఠలా....
విఠలా...విఠలా విఠలా

చరణం::2

త్యాగాలెరుగను యోగాలెరుగను
రాగభోగముల రక్తిని కోరను
త్యాగాలెరుగను యోగాలెరుగను
రాగభోగముల రక్తిని కోరను
అనురక్తితో నీ నామామృతమును
అనురక్తితో నీ నామామృతమును
ఆస్వాదించే సాధన చాలును
ఆస్వాదించే సాధన చాలూ
పుండరీకవరదా జయపాండురంగ
పాండురంగ విఠలా జయపాండురంగ
విఠలా.....
పుండరీకవరదా... జయపాండురంగ
పాండురంగ విఠలా...