Showing posts with label శ్రీశ్రీ. Show all posts
Showing posts with label శ్రీశ్రీ. Show all posts

ఔను నిజం... ప్రణయరథం



ఔను నిజం ప్రణయరథం
జింబో (1959)
రచన: శ్రీశ్రీ 
సంగీతం: చిత్రగుప్త, విజయ భాస్కర్ 
గానం: సుశీల 

ఔను నిజం ప్రణయరథం
సాగెను నేడే 
కోరిన కోరిక పారటలాడే!

ఇంపారే పూల నిండారే సుధల్ 
సైదోడై చేరి దాగుండే జతల్  

హాయి జనించే! ఆశ రహించే! 
కోయని కోయిల కమ్మగ పాడే! 

నీ కథ ఇది



నీ కథ ఇది 
జింబో (1959)
రచన: శ్రీశ్రీ 
సంగీతం: చిత్రగుప్త, విజయ భాస్కర్ 
గానం: సుశీల 

నీ కథ ఇది కల కాదూ 
ఈ ప్రణయమె విడరాదూ! 

హృదయంలో కెరటాలు 
జలపాతములై రేగే!

కారణమే లేదాయె 
నా ప్రాణమె నీదాయె! 

హృదయ విహంగమ్మెగిరీ 
ఆశించినదీ సుఖమే!

మామా! శతృభయంకర నామా!


మామా! శతృభయంకర నామా!
చిత్రం : కులగోత్రాలు (1962)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : శ్రీశ్రీ 
నేపధ్య గానం : పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం, 
రమణారెడ్డి, పద్మనాభం, రేలంగి, సూర్యకాంతం 

మామా! శతృభయంకర నామా!
అందానికి చందమామా-
మా మామ... 
ఈ సదానందానికి సాక్షాత్తు మేనమామ 
బలమున గామా....
(గామా; ప్రపంచ ప్రసిద్ధి చెందిన వస్తాదు.)
నీవే కద మా ధీమా.... 
గుణధామా! 
విశ్వదాభిరామా! 
మామా!

తల్లిని మించి ధారుణి



తల్లిని మించి
చిత్రం: అభిమానం (1960)
రచన: శ్రీశ్రీ
సంగీతం: ఘంటసాల
గానం: జిక్కి

పల్లవి:

తల్లిని మించి ధారుణి వేరే దైవము లేనే లేదుగా
చల్లనితల్లి దీవెనలున్న ఇల్లే స్వర్గముగా

తల్లిని మించి ధారుణి వేరే దైవము లేనే లేదుగా
చల్లనితల్లి దీవెనలున్న ఇల్లే స్వర్గముగా

ఓ.. సుకుమారా..


ఓ.. సుకుమారా..
చిత్రం :  భార్యాభర్తలు (1961)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి:

ఓ.. సుకుమారా.. నను చేరా.. రావోయి.. ఇటు రావోయి..
నిలువగ లేని.. వలపులరాణి.. నీ కొరకే.. తపించునులే
నిలువగ లేని.. వలపులరాణి.. నీ కొరకే.. తపించునులే

ఓ.. జవరాలా.. ప్రియురాలా.. ఈనాడే.. మనదే హాయి
తనువుగ నేడు.. ఈ చెలికాడు.. నీ దరినే.. సుఖించునులే

చల్లని వెన్నెల సోనలు

చల్లని వెన్నెల సోనలు
చిత్రం :  వెలుగు నీడలు (1961)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  సుశీల, జిక్కి

చల్లని వెన్నెల సోనలు - తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసినవ్వులే
మంచి ముత్యముల వానలు- "చల్లని"

పిడికిలి మూసిన చేతులు - లేత గులాబీ రేకులు పిడికిలి
మూసిన చేతులు - లేత గులాబీ రేకులు పిడికిలి
చెంపకు చారెడు సోగకన్నులే
సంపదలీనెడు జ్యోతులు
మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు -"చల్లని"

ఇంటను వెలసిన దైవము - కంటను మెరిసిన దీపం

మా హృదయాలకు హాయి నొసంగే
పాపాయే మా ప్రాణము "ఇంటను"

చల్లని వెన్నెల సోనలు - తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి నవ్వు పువ్వులె
మంచి ముత్యముల వానలు
నోచిన నోముల పంటగ - అందరి కళ్ళకు విందుగా
పేరు ప్రతిష్టలె నీ పెన్నిథిగా
నూరేళ్ళాయువు పొందుమా

-చల్లని

ఈ పాటను శ్రీశ్రీ రాయగా సుశీల, జిక్కి ఆలపించారు. సావిత్రి, గిరిజ అభినయించారు. సన్నివేశ ప్రాధాన్యంగా సూర్యకాంతం, ముగ్గురు చిన్నపిల్లలు ఏడాదిలోపు, రెండు మూడేళ్ళలోపు, అయిదారేళ్ళ లోపు పిల్లలు కనిపిస్తారు. పుట్టి పెరుగుతున్న పిల్లవాణ్ణి పెంచుతున్న కన్నతల్లి హృదయం, ఆ పిల్లవాడిపై మమకారం పెంచుకున్న మరో మాతృ హృదయం - స్పందిస్తే ఎటువంటి భావాలు కలుగుతాయో వాటినే అక్షర రూపంలో అందించారు శ్రీశ్రీ. పరకాయ ప్రవేశ విద్య మంచి కవికి అంతర్లీనంగా ఉంటుందనటానికి ఈ పాట ఓ ఉదాహరణ.

ఇక్కడ ఆనాటి విలువల గురించి మరోసారి చెప్పుకోవాలి. పాట మొదట్లో మా పాపాయి బోసిననవ్వులె మంచి ముత్యముల వానలు - అని ఉంటుంది. తర్వాత నుంచి - మా పాపాయి నవ్వు పువ్వులె మంచి ముత్యముల వానలు - గా ఆ లైను రూపాంతరం చెందుతుంది. అందుకు కారణం - పిల్లవాడు పెరిగి బోసి నవ్వుల స్థాయి నుండి పళ్ళొచ్చాక అందంగా నవ్వేటంతగా పెద్దవాడయ్యాడు - అని ఎస్టాబ్లిష్ చెయ్యాలనుకోవటమే! నిర్మాత, దర్శకుడు, పాటల రచయిత కలిసి కూర్చుని అనుకుంటేనే గాని ఇంత లోతైన అవగాహన కలగదు. ఆనాడు ఉన్నదీ, ఈనాడు కొరవడుతున్నదీ అదే!

ఈ పాటను వకుళాభరణం రాగం ఆధారంగా స్వరపరిచారు. 'ఇంటను వెలిసిన దీపము' చరణానికి చక్రవాక రాగాన్ని, 'నోచిన నోములు పండగా' చరణం వద్ద మాయా మాళవ రాగాన్ని స్పృశించినా వకుళాభరణ రాగాన్నే ప్రధానంగా చేసుకుని పాటను నడపడం జరిగింది. ఈ పాటకు బెంగాలీలో గీతారయ్ పాడిన 'కాజల్ కాజల్ కుమ్ కుమ్' అనే ప్రైవేట్ గీతం ట్యూన్ ఆధారం అని శ్రీ.వి.ఎ.కె. రంగారావు తన 'ఆలాపన' శీర్షికలో పేర్కొన్నారు.