తెలుసులే తెలుసులే

తెలుసులే తెలుసులే 


చిత్రం: జేగంటలు (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

తెలుసులే తెలుసులే  
నీకు తెలుసోలేదో గానీ నాకు తెలుసులే 
ఎవరేమన్నా ఏమనుకున్నా 
ప్రేమే గెలవక తప్పదని 
తెలుసులే

తెలుసులే తెలుసులే  
నీకు తెలుసోలేదో గానీ నాకు తెలుసులే 
కౌగిట కలిసిన ప్రేమలకు 
చీకటి తొలగక తప్పదనీ 
తెలుసులే
తెలుసులే తెలుసులే

​మాతృభాష


ఇప్పుడు ప్రజలంతా పుస్తకాలను వాడుకభాషలో చదువుతున్నా, విద్యార్థులు మాట్లాడే భాషలోనే పరీక్షలు వ్రాస్తున్నా...అదంతా "వాడుక భాషోద్యమ పితామహుడు"గా ప్రసిద్ధికెక్కిన గిడుగు వేంకట రామ్మూర్తి పంతులు గారి (ఆగష్టు 29, 1863 - జనవరి 22, 1940) చలవే. గ్రాంథికభాషలో ఉన్నతెలుగు వచనాన్ని వాడుకభాషలోకి తీసుకువచ్చి, నిత్య వ్యవహారిక భాషలో ఉన్న సౌందర్యాన్నీ, సుళువునూ తెలియజెప్పిన మహనీయుడు గిడుగు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషాశాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త,హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథ రచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెనుగు చిచ్చర పిడుగు...గిడుగు. ఆయన  గారి ఉద్యమం వల్లనే... ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు, వ్యావహారికభాషలో సాగి, ఎక్కువ మందిని ఆకర్షించి మరింతగా అందుబాటులోకి వచ్చింది. అప్పటిదాకా పుస్తకాల్లో ఉన్న ఎక్కువమందికి అర్థం కాని భాష వ్యర్ధమనీ, కనీసం పిల్లలు చదివే పాఠ్యపుస్తకాలయినా వాడుకభాషలో ఉండాలని రామ్మూర్తిగారు ఉద్యమించారు. ఆయన మరణించేవరకూ వాడుకభాష అమలు కోసమే పోరాడారు. తెలుగు వ్యావహారిక భాషాభ్యున్నతికి గిడుగు రామ్మూర్తి పంతులు గారి సేవలను గుర్తిస్తూ ఆయన జయంతిని పురస్కరించుకుని 'తెలుగుభాషా దినోత్సవము'గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పరిగణిస్తుంది.

నీ కాటుక కన్నుల తళుకే



నీ కాటుక కన్నుల తళుకే
చిత్రం: నా పిలుపే ప్రభంజనం (1986)
సంగీతం: రాజ్-కోటి
గానం: రాజ్ సీతారామ్, సుశీల

పల్లవి:

నీ కాటుక కన్నుల తళుకే
నను రారమ్మనే
నీ బిగి కౌగిలిలో కులుకే
నను లే లెమ్మనే

గడసరి మగసిరి వాడివనే  
నిను కోరేనులే
నా సరి సొగసరి వాడివనే
నిను చేరేనులే...

ఈ బ్రతుకే ఒక ఆట


ఈ బ్రతుకే ఒక ఆట 
చిత్రం: ఇద్దరూ అసాధ్యులే (1979)
సంగీతం: సత్యం
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు

పల్లవి:

తల్లొక చోటా 
పిల్లొక చోటా  
కొమ్మలేదట 
గూడూ లేదట 
ఏ వేటగాడో 
విడదీసినాడటా... 
 
ఈ బ్రతుకే ఒక ఆట 
ఇది దేవుడు ఆడే పిల్లాట 
మనుషులు, మాకులు 
పశువులు, పక్షులు 
అన్నీ బొమ్మలటా...
అన్నీ బొమ్మలటా...

సో బ్యూటీ...ఊటీ...ఊటీ...ఊటీ


సో బ్యూటీ...ఊటీ...ఊటీ...ఊటీ 
శుభవార్త (1998)
గానం: చిత్ర, బాలు 
సంగీతం: కోటి 
రచన: భువనచంద్ర  

పల్లవి: 

కుల్కు బేబీ 
మస్తు రూబీ 
గుల్ గులాబీ 
ఎంటర్‌టైనింగ్ 
నా హాబీ...

ఆకశాన మెరిసే 
మేలిమబ్బు వయ్యారాలతోటి 
నేలతల్లి ఒడిలో 
గుప్పుమన్న పరిమళాల పోటీ 
సో బ్యూటీ...ఊటీ...ఊటీ...ఊటీ

కుల్కు బేబీ 
మస్తు రూబీ 
గుల్ గులాబీ 
ఎంటర్‌టైనింగ్ 
నా హాబీ...

ముందెళ్ళే దానా



ముందెళ్ళే దానా
ఏడడుగుల బంధం (1985)
సంగీతం: శంకర్-గణేష్
గానం: బాలు
రచన: మైలవరపు గోపి

పల్లవి:

ఏయ్... ముందెళ్ళే దానా
నీ ఎనకాలే రానా
నా ముందెళ్ళే దానా
నీ ఎనకాలే రానా
చిన్నదాన ఉన్నాదాన
చెంప స్వరాలున్నా దానా
ఉన్నది జాగరతే
పిల్లదానా 
నిన్నున్నట్లే దోచాలని నేనున్నా 
నువ్వెంత గడుసైనా 
నీ కల్లోకి రానా 
కాటుకెట్టలేనా 
నిను కాటెయ్యలేనా
ముందెళ్ళే దానా నీ ఎనకాలే రానా

ఇది మౌనగీతం...



ఇది మౌనగీతం...
పాలు-నీళ్ళు (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
గానం: ఆశా భోస్లే 
రచన: దాసరి  

పల్లవి:

ఇది మౌనగీతం...
ఒక మూగ రాగం...
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం 
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం 
ఇది మౌనగీతం...
ఒక మూగ రాగం...

ప్రేమా ప్రేమా చెప్పమ్మా



ప్రేమా ప్రేమా చెప్పమ్మా 
రుక్మిణి (1997)
సంగీతం: విద్యాసాగర్
రచన: సిరివెన్నెల
గానం: విద్యాసాగర్, చిత్ర, బాలు 

పల్లవి:

ప్రేమా ప్రేమా చెప్పమ్మా 
చితిమంటేనా నీ చిరునామా 
పసి హృదయాలను పావులు చేసే 
మాయాజూదం చాలమ్మా 
జతకలుపుట పాపమా 
చరితలకిది లోపమా 
మమతకు ఈ గాయమే న్యాయమా...?

ప్రేమా ప్రేమా చెప్పమ్మా 
చితిమంటేనా నీ చిరునామా 
పసి హృదయాలను పావులు చేసే 
మాయాజూదం చాలమ్మా 

నడక సాగితే రాదారీ


నడక సాగితే రాదారీ
ఇంటింటి భాగవతం (1988)
రచన: జాలాది రాజారావు 
సంగీతం: వాసూరావు 
గానం: బాలు 

పల్లవి:

నడక సాగితే రాదారీ
పడవ లాగితే గోదారి
నడక సాగితే రాదారీ
పడవ లాగితే గోదారి 

రాదారి వరదొచ్చి మునిగితే 
అది గోదారౌతాది 
గోదారి ఎండేసి ఎండితే 
మళ్ళీ రాదారే ఔతాది 

నడక సాగితే రాదారీ
పడవ లాగితే గోదారి

ఆపద మొక్కులవాడా



ఆపద మొక్కులవాడా 
నిండు మనసులు (1967)
గానం: సుశీల 
రచన: సినారె 
సంగీతం: టి.వి.రాజు 

పల్లవి:

ఆపద మొక్కులవాడా 
ఓ శ్రీనివాసా... 
ఆపద మొక్కులవాడా 
ఓ శ్రీనివాస... 
అడుగడుగున కాపాడే 
తిరుమలగిరివాసా 
శ్రీనివాసా శ్రీనివాసా