దొంగ రాముడు (1955)
రచన: సముద్రాల సీనియర్
సంగీతం: పెండ్యాల
గానం: సుశీల
పల్లవి :
తెలిసిందా బాబూ
ఇపుడు తెలిసిందా బాబూ
తెలిసిందా బాబూ
ఇపుడు తెలిసిందా బాబూ
అయ్యవారు తెలిపే నీతులా
ఆలించకపోతే వాతలే
తెలిసిందా బాబూ...
చరణం 1:
అల్లరిపిల్లల కూడవుగా
గిల్లీకజ్జాలాడవుగా
ఓ . ..
ఇక వేయవుగాదా ఈతలు
తెగ కోయవుగాదా కోతలూ
బాగేమిటో ఓగేమిటో నీకిపుడైనా
తెలిసిందా బాబూ...
చరణం 2:
చదువుకు సున్నాచుట్టవుగా
గురువుకు నామంపెట్టవుగా
ఓ . ..
పొరపాటు పనికి పోవుగా
మరియాదకు లోటూ తేవుగా
బాగేమిటో ఓగేమిటో నీకిపుడైనా
తెలిసిందా బాబూ...
చరణం 3:
వినయముమీరా తల్లిపదాలను
దినమూ కొలవాలి
ఆహా దినమూ కొలవాలి
మనసున చెల్లెలి మాట మరువకా
మన్నన చెయ్యాలి
ఆహా మన్నన చెయ్యాలి
ఓ . ..
ఇరుగూ పొరుగూ సెబాసన
పరువెరిగీ నీవూ మెలగాలి
మన వూరికీ, మనవారికీ పేరు తేవాలి
తెలిసిందా బాబూ...