Showing posts with label జయశ్రీ పల్లెం. Show all posts
Showing posts with label జయశ్రీ పల్లెం. Show all posts

రాంబాయి నీ మీద నాకు

రాజు వెడ్స్ రాంబాయి (2025) 
గానం: అనురాగ్ కులకర్ణి, జయశ్రీ పల్లెం
సంగీతం: సురేశ్ బొబ్బిలి 
రచన: మిట్టపల్లి సురేందర్ 

పల్లవి :  

రాజూ నువ్వెప్పుడూ 
బ్యాండు కొడుతూనే ఉండు ఆ
మనకు పెళ్లయినా 
బ్యాండు కొడుతూనే ఉండు
మనకు పిల్లలు పుట్టినా 
బ్యాండు కొడుతూనే ఉండు
మనం ముసిలోళ్ళమయిపోయినా 
బ్యాండు కొడుతూనే ఉండు
సరేనా...!

ఇంకోటి..
మనం ప్రేమించుకున్నదెవరికీ చెప్పకు 

చెప్పన్లే గానీ 
తోవమీద నీ పేరుంచాల్నా  
తుడిపెయ్యాల్నా 

తుడపకులే...
చిన్నగ రాస్కో..!

విచిత్రాల ఈ ప్రేమ 
ఏ అంతరాలు ఎంచదమ్మా
మనసొక్కటే జన్మస్థానమంటు 
కొత్త కథలాగా మొదలైతదమ్మా
బొట్టుపెట్టుకు చందమామ 
ఈ నేల మీద పుట్టెనమ్మా
అడుగు మోపుతుంటే 
గొడుగులాగ మారి
పూలకొమ్మలు వంగెనమ్మా