Showing posts with label చింతామణి. Show all posts
Showing posts with label చింతామణి. Show all posts

చింతామణి-హెచ్.ఎమ్.వి క్యాసెట్టు మొదటిభాగం

"చింతామణి" తెలుగు నాట బహు ప్రసిద్ధి  చెందిన నాటకం. 
20వ శతాబ్దంలో మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది.
ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం.ఎన్నో ప్రదర్శనలకు నోచుకొని రచయితను లబ్ద ప్రతిష్టుడ్ని చేసిన నాటకమిది. రక్తికట్టడానికి నాటక పాత్రధారులు అసలు నాటకానికి భిన్నంగా ఎన్నో ప్రక్షిప్తాలను జోడించి హాస్యం కురిపించి కొన్ని వర్గాలను కించపరచకపోలేదు. కానీ, అసలు కవి హృదయం కాదది. మూలనాటకంలోని సంస్కరణాభిలాష, సాంఘిక చైతన్యం ఈనాడు చదివితే రచయిత గొప్పదనం, నాటకం విశిష్టత తేటతెల్లమవుతుంది. 

ప్రధాన పాత్రలు:-
చింతామణి
బిల్వమంగళుడు
సుబ్బిశెట్టి
భవానీ శంకరం
శ్రీహరి
చిత్ర

నాటక కథ:


చింతామణి ఒక వేశ్య. ఆమె తల్లి శ్రీ హరి,చెల్లి చిత్ర. భవానీ శంకరుడనే నియోగ బ్రాహ్మణుడు, సుబ్బిశెట్టి అనే వ్యాపారి ఆమె ప్రధాన విటులు.ఆమె వారి ఆస్తి నంతా అపహరిస్తుంది. భవానీ శంకరం ద్వారా చింతామణి...అతని స్నేహితుడు, ధనవంతుడు, శీలవంతుడు, విద్యావంతుడు అయిన బిల్వమంగళుని ఆకర్షిస్తుంది. బిల్వమంగళుడు, ఆమె వలలో పడి భార్యను, వార్ధక్యంతో అనారోగ్యం పాలైన తండ్రిని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. ఒక రోజు బాగా వర్షం పడుతున్న వేళ బిల్వమంగళుడు అర్ధరాత్రి నీటిలో తేలివచ్చినదనుకున్న ఒక దుంగ ఆధారంతో వాగు దాటి చింతామణి గృహం చేరుకొని తలుపులు వేసి ఉంటే గోడమీద వ్రేలాడుతున్న తాడు సాయంతో ఇంట్లో ప్రవేశిస్తాడు. దీపం తెచ్చి చూస్తే అది తాడు కాదు పాము. అదే విధంగా వాగు దాటడానికి సహకరిచింది దుంగ కాదు బిల్వమంగళుని భార్య రాధ శవం. భర్త వాగు దాటడానికి పడవని పిలిచే ప్రయత్నంలో వాగులో పడి మరణిస్తుంది రాధ. బిల్వమంగళునికి తనపై ఉన్న వ్యామోహానికి విస్తుపోతుంది చింతామణి. బిల్వమంగళునిలో పరివర్తన వస్తుంది. ఆ రాత్రి చింతామణికి శ్రీకృష్ణుడు కనబడతాడు. దానితో ఆమెలో వైరాగ్యం కలిగి సన్యసిస్తుంది.బిల్వమంగళుడు కూడా సోమదేవ మహర్షి పిలుపువల్ల ప్రభావితుడై ఆశ్రమ స్వీకారం చేసి అనంతర కాలంలో లీలాశుక యోగీంద్రుడుగా మారి శ్రీ కృష్ణ కర్ణామృతం అనే సంస్కృత గ్రంథాన్ని రాస్తాడు. 

చింతామణి నాటకం డైలాగులు హెచ్.ఎమ్.వి వాళ్ళు రెండు క్యాసెట్ల రూపంలో తెచ్చారు. అది కాళ్ళకూరి నారాయణరావు గారు తొలుత వ్రాసిన నాటకాన్ని చాలా మార్చి ఇంకా లోతుగా జనబాహుళ్యం లోకి వెళ్ళగలిగేలా చేశారు. ఇందులోని డైలాగులు మొత్తం గుంటూరు, ప్రకాశం జిల్లాల మాండలికంలో జరుగుతుంది. ఈ కథ సర్వకాలాలందును, సర్వ వ్యవస్థలలోనూ నిబిడీకృతమయిన ఒక వ్యసనం గూర్చిన ప్రస్తావన. కథావిషయం, వాక్యప్రసంగం దాదాపు కాలాతీతం. అందుకే ఈ నాటకం చిరస్థాయిగా నిలిచింది. 

గాత్రధారులు: వి.వి.స్వామి, చీరాల సుబ్బయ్య, లతా లక్ష్మి ముఖ్యులు. 


చింతామణి:-
"కృష్ణా... ఆ..ఆ..ఆ..
రార మా ఇంటికి... కృష్ణయ్యా
రార మా ఇంటికి... కృష్ణయ్యా
రావోయి మా ఇంటికి... కృష్ణయ్యా
రావోయి మా ఇంటికి.."

చింతామణి-హెచ్.ఎమ్.వి క్యాసెట్టు రెండవ భాగం


శ్రీహరి:-
"అమ్మా...!  బిల్వమంగళమూర్తి గారొచ్చేసారమ్మా... 
దయచేయండి బాబూ దయచేయండి...కూర్చోండి. 
అమ్మాయికి తగని సిగ్గూ....! 
అమ్మా మనకెందుకమ్మా సిగ్గు...? 
ఎడ మధ్యాన ఆడది కనబడితే ఎనుబోతుల్లాగా ఎమ్మటబడే 
మగోళ్ళకే సిగ్గులేదే......మనకెందుకమ్మా సిగ్గు?"

చింతామణి:-
"సగమగనిసా... సనిదమగనిసా..."

శ్రీహరి:-
"అమ్మాయి సంగీతం సాధన చేస్తుంది." 

బిల్వమంగళ:-
"ఆ ..."

చింతామణి:-
"సామజవరగమనా.... సామజవరగమనా 
సాధుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత 
సామజవరగమనా... ఆ..."