Showing posts with label ఏ.ఎమ్.రాజా. Show all posts
Showing posts with label ఏ.ఎమ్.రాజా. Show all posts

ఆడువారి మాటలు

ఆడువారి మాటలు 
ఇంటిగుట్టు (1958)
రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి 
సంగీతం: ఎమ్మెస్ ప్రకాశ్
గానం: ఏ.ఎమ్. రాజా

పల్లవి :  

ఆడువారీ మాటలు
రాక్అన్‌రోల్ పాటలు 
ఆడువారి కోపాలు 
మాపైన పన్నీటిజల్లులు 

ఆడువారీ మాటలు
రాక్ అన్ రోల్ పాటలు 
ఆడువారి కోపాలు 
మాపైన పన్నీటిజల్లులు 

డియోడిడిడీడీ  
డియోడిడిడీడీ
డియోడిడిడీడీ

యవ్వన మధువనిలో


యవ్వన మధువనిలో
చిత్రం : బంగారు పాప (1954)
సంగీతం :  ఓగిరాల రామచంద్రరావు
గీతరచయిత :  దేవులపల్లి కృష్ణశాస్త్రి
నేపధ్య గానం :  ఏ.ఎమ్.రాజా, సుశీల

పల్లవి:

ఓహో ఓ ఓ ఓ ఓ
యవ్వన మధువనిలో వన్నెల పువ్వుల ఉయ్యాల
యవ్వన మధువనిలో వన్నెల పువ్వుల ఉయ్యాల
ఉయ్యాల.. జంపాల.. ఉయ్యాల... జంపాల

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జీవన మధువనిలో పచ్చని తీగల ఉయ్యాల
జీవన మధువనిలో పచ్చని తీగల ఉయ్యాల

ఉయ్యాల...జంపాల.. ఉయ్యాల... జంపాల

పాడు జీవితము యవ్వనం


పాడు జీవితము యవ్వనం
ప్రేమలేఖలు (1953)
శంకర్-జైకిషన్
ఆరుద్ర
ఏ.ఎమ్.రాజా

పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ ముచ్చటలోయి
అయ్యయ్యో నీదు పరుగులెచటకోయి
పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ ముచ్చటలోయి
అయ్యయ్యో నీదు పరుగులెచటకోయి

మనసూగే సఖ తనువూగే

నాగిని చిత్రంలోని -'తన్ డోలే మేరా మన్ డోలే’ ట్యూన్ ఆధారంగా రూపొందిన యుగళ గీతం.
ఎన్టీఆర్, జమునలపై ఆహ్లాదకర చిత్రీకరణ -మనసూగే సఖ తనువూగే ప్రియా మదిలో.

మనసూగే సఖ తనువూగే
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: దేవులపల్లి కృష్ణశాస్త్రి
నేపధ్య గానం: ఏ.ఎమ్.రాజా, పి. సుశీల

మనసూగే సఖ తనువూగే ప్రియ
మదిలో సుఖాల డోలలూగే
ఏ మధువా నేనోయి ప్రియా

వయసూగే చెలి సొగసూగే
ప్రియ వగలాడి ఓర చూపులూగే
ఏ మధువా నేనో సఖియా

మలుపు మలుపు కడ నిలిచీ
చెవిలో మంతనాలు ఊదాలి.
కలసి మెలసి కలకాలమిలాగే
మధురయాత్ర సాగాలి
ఇలాగే మధురయాత్ర సాగాలి
మనసూగే సఖ తనువూగే ప్రియ
మదిలో సుఖాల డోలలూగే
ఏ మధువా నేనోయి ప్రియా

అలలూగే మది కలలూగే ప్రియ
తెలివాక పూల నౌక ఊగే
ఏ వలపూపేనోయి ప్రియా

రేవు రేవు కడ కనులు కనులతో
మూగబాస లాడాలి
పైరగాలి పన్నీటి ఏటిపై
పడవ సాగిపోవాలి
ఇలాగే పడవ సాగిపోవాలి
మనసూగే సఖ తనువూగే ప్రియ
మదిలో సుఖాల డోలలూగే
ఏ మధువా నేనోయి ప్రియా